పోస్టల్ పథకాలు... కొత్త నిబంధనలు అమల్లోకి...
ABN , First Publish Date - 2021-03-08T00:25:00+05:30 IST
పోస్టల్ పథకాకు సంబంధించిన నిబంధనలు మారాయి. పోస్టాఫీస్ జీడీఎస్(గ్రామీణ్ డాక్ సేవ) బ్రాంచుల్లో క్యాష్ విత్డ్రాయెల్ లిమిట్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 5 వేల నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు తాజాగా అమల్లోకి వచ్చాయి. వివరాలిలా ఉన్నాయి.
న్యూఢిల్లీ : పోస్టల్ పథకాకు సంబంధించిన నిబంధనలు మారాయి. పోస్టాఫీస్ జీడీఎస్(గ్రామీణ్ డాక్ సేవ) బ్రాంచుల్లో క్యాష్ విత్డ్రాయెల్ లిమిట్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 5 వేల నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు తాజాగా అమల్లోకి వచ్చాయి. వివరాలిలా ఉన్నాయి.
పోస్టల్ జీడీఎష్ బ్రాంచ్ ల నుంచి రూ. 5 వేలు కాకుండా ఇప్పుడు రూ. 20 వేలు విత్డ్రా చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రోజుకు ఒక అకౌంట్లో రూ. 50 వేలకు మించి డబ్బు డిపాజిట్ చేయడానికి వీలు లేదు. ఇంకా పలు అంశాలు మారాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఎన్ఎస్సీ తదితర పథకాల్లో డిపాజిట్ చేయడానికి కూడా విత్డ్రాయెల్ ఫామ్ లేదా చెక్ ఉపయోగించొచ్చు. అలాగే సేవింగ్స్ ఖాతా కలిగిన వారు కచ్చితంగా రూ. 500 మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలి. ఒకవేళ అకౌంట్లో రూ. 500 మినిమమ్ బ్యాలెన్స్ లేనిపక్షంలో... అకౌంట్ నుంచి రూ. 100 కట్ అవుతుంది.