వివేకా హత్య కేసు విచారణలో మారుతున్న సమీకరణలు!

ABN , First Publish Date - 2021-08-11T23:33:59+05:30 IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సీబీఐ విచారణలో సమీకరణలు మారుతున్నాయి. గత నాలుగు రోజులుగా సీబీఐ బృందాలు విచారణలో దూకుడు పెంచాయి.

వివేకా హత్య కేసు విచారణలో మారుతున్న సమీకరణలు!

కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సీబీఐ విచారణలో సమీకరణలు మారుతున్నాయి. గత నాలుగు రోజులుగా సీబీఐ బృందాలు విచారణలో దూకుడు పెంచాయి. త్వరలోనే  వివేకా హత్యకేసు మిష్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పులివెందులలో మంగళవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు రాఘవరెడ్డి, రమణారెడ్డిలను తొలిసారిగా సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకా మొదట గుండెపోటు తోమరణించారని ఎలా చెప్పా రని వారిని ప్రశ్నించినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధిని కూడా పిలిచి ఇదే ప్రశ్నే అడిగినట్లు తెలుస్తోంది. గుండెపోటుతో అని ఎలా వార్తలు ప్రసారం చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది.


బుధవారం తెల్లవారుజామున కర్నాటక నుండి బ్యాంక్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కడపలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. అక్కడ జరిగిన ఆర్ధిక లావాదేవీలు, భూములుపై వివరాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పులివెందులలో సునీల్ తల్లి సావిత్రమ్మ, తమ్ముడు కిరణ్‌లను స్వగ్రామం మోటునూతనపల్లెకు సీబీఐ బృందం తీసుకెళ్లింది. పులివెందులకు చెందిన వివేకా అత్యంత సన్నిహితడు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌లను సీబీఐ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. ఇరువురిని కడపకు తరలిస్తున్నట్లు సమాచారం. 


Updated Date - 2021-08-11T23:33:59+05:30 IST