టర్కీ మసీదు తరహాలో సచివాలయంలో ప్రార్థనాలయం

ABN , First Publish Date - 2021-06-14T09:46:23+05:30 IST

తెలంగాణ నూతన సచివాలయ ప్రాంగణంలో నిర్మించతలపెట్టిన మసీదు నమూనాను ప్రభుత్వం ఖరారు చేసింది.

టర్కీ మసీదు తరహాలో సచివాలయంలో ప్రార్థనాలయం

  • నెలాఖరు నాటికి శంకుస్థాపన
  • 9 నెలల్లో నిర్మాణం పూర్తి

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నూతన సచివాలయ ప్రాంగణంలో నిర్మించతలపెట్టిన మసీదు నమూనాను ప్రభుత్వం ఖరారు చేసింది. టర్కీ మసీదు తరహాలో ఈ ప్రార్థనాలయాన్ని నిర్మించనున్నారు. మసీదు నమూనా, నిర్మాణానికి సంబంధించి హోంమంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ సలహాదారు ఏకేఖాన్‌ ఇటీవల ఆర్కిటెక్ట్‌లతో సమీక్ష నిర్వహించారు. పలు నమూనాలు పరిశీలించిన తర్వాత టర్కీ మసీదు నమూనాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరు నాటికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నారు. మార్చి 2022 నాటి కి నిర్మాణం పూర్తి చేసి, ప్రార్థనలకు అనుమతించనున్నారు. పాత సచివాలయ ప్రాంగణంలో రెండు మసీదులు ఉండగా, కొత్త సచివాలయ ప్రాంగణంలోనూ రెండు మసీదులను నిర్మిస్తున్నారు. 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే పెద్ద మసీదులో ఒకేసారి 400 మంది ప్రార్థనలు చేసుకునే వీలు ఉంటుంది. మసీదు బయట వెయ్యి మంది వరకు ప్రార్థనల్లో పాల్గొనవచ్చు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో చిన్న మసీదు నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-06-14T09:46:23+05:30 IST