జూలై 1 నుంచి చార్ధామ్ యాత్ర
ABN , First Publish Date - 2020-06-30T08:07:03+05:30 IST
చార్ధామ్ యాత్రకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1న ఈ యాత్ర మొదలవుతుందని ప్రభుత్వం సోమ వారం ప్రకటించింది. కాకపోతే, ఈసారి ఉత్తరాఖండ్ వాసులకు మాత్రమే అవకాశం కల్పించింది...
- ఉత్తరాఖండ్ భక్తులకు మాత్రమే అనుమతి
డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), జూన్ 29: చార్ధామ్ యాత్రకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1న ఈ యాత్ర మొదలవుతుందని ప్రభుత్వం సోమ వారం ప్రకటించింది. కాకపోతే, ఈసారి ఉత్తరాఖండ్ వాసులకు మాత్రమే అవకాశం కల్పిం చింది. వారిలో కూడా క్వారంటైన్లో ఉన్నవారికి, కట్టడి ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అను మతించబోమని చెప్పింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వారిని ఈసారి యాత్రకు అనుమతించలేకపోతున్నట్లు తెలిపింది. యాత్రికులకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దర్శనం కోసం యాత్రికులు ముందుగానే ఈ-పాస్లు పొందాలని సూచిం చింది. కరోనా లక్షణాలున్నవారు ఈ-పాస్లకు దరఖాస్తు చేయవద్దని కోరింది. దేవస్థానం జారీచేసిన ఈ-పాస్లు కేవలం 2 రోజులు మాత్రమే చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది.