82 మంది విదేశీ తబ్లిగీలపై కోర్టులో చార్జిషీట్లు
ABN , First Publish Date - 2020-05-27T07:04:14+05:30 IST
82 మంది విదేశీ తబ్లిగీలపై కోర్టులో చార్జిషీట్లు
న్యూఢిల్లీ, మే 26: వీసా నిబంధనలను ఉల్లంఘించి నిజాముద్దీన్ మర్కజ్లో తబ్లిగీ సమావేశాలకు హాజరైన విదేశీయులలో 82 మందిపై ఢిల్లీ పోలీసులు మంగళవారం స్థానిక మెట్రోపాలిటన్ కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేశారు. 20 దేశాలకు చెందిన విదేశీయులపై చార్జిషీట్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ప్రబలిన సమయంలో వీరంతా చట్టవిరుద్ధంగా తబ్లిగీ జమాత్ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారని అభియోగాలు దాఖలయ్యాయి. కాగా, తబ్లిగీ జమాత్ సభ్యులను అరెస్టు చేయలేదని, వారిని నిర్బంధించలేదని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. మర్కజ్లో పాల్గొన్న 916 మంది విదేశీయులను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై పోలీసులు ఈ మేరకు సమాధానమిచ్చారు.