ఛార్జింగ్ స్టేషన్లు... త్వరలో 12 వేల ఉద్యోగాలు...
ABN , First Publish Date - 2021-04-05T00:22:07+05:30 IST
విద్యుత్తు వాహనాల అమ్మకాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. విద్యుత్తు వాహనాలు క్రమంగా పెరుగుతుండటంతో ఇందుకణుగుణంగా ఛార్జింగ్ స్టేషన్స్ను ఏర్పాటు కూడా జరగనుంది.
పూనే : విద్యుత్తు వాహనాల అమ్మకాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. విద్యుత్తు వాహనాలు క్రమంగా పెరుగుతుండటంతో ఇందుకణుగుణంగా ఛార్జింగ్ స్టేషన్స్ను ఏర్పాటు కూడా జరగనుంది. కరోనా ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముడి చమురు దిగుమతిపై గతేడాది కాలంలో ప్రభుత్వం రెండుమార్లు భారీగా దిగుమతి సుంకాలను పెంచిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయంగా, తదణుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశంలో విద్యుత్తు వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇదేక్రమంలో దేశవ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాల్సిన అవసర పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో యువతకు వేలాది ఉద్యోగావకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 మూడో త్రైమాసికం తర్వాత విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాల్లో 10-12వేల ఉద్యోగాలు అందుబాటులోకొస్తాయని టీంలీజ్ సర్వీసెస్ అనే కన్సల్టింగ్ సంస్థ అంచనా వేసింది.
త్వరలో ఉద్యోగాలు...
వచ్చే 3-4 నెలల కాలంలో వివిధ విద్యుత్తువాహన సంస్థలు చార్జింగ్ స్టేషన్లలో తమకవసరమైన సిబ్బందిని నియమించడాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయని టీమ్ లిజ్ పేర్కొంది. తొలిదశలో నాలుగు మెట్రో నగరాలు, నాలుగు కాస్మోపాలిటన్ నగరాల్లో 60 వరకు ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.