ఆ ప్రసక్తే లేదు
ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST
లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు నిలిచిపోవడంతో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు ఛార్మి. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఆ షెడ్యూల్స్ అన్నీ నెటిజన్లకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు...
లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు నిలిచిపోవడంతో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు ఛార్మి. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఆ షెడ్యూల్స్ అన్నీ నెటిజన్లకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో మాట్లాడారు. అందులో ఓ నెటిజన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కథలో మార్పులు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత ఇవ్వండి’ అని ఛార్మిని అడిగారు. దీనికి ఛార్మి మాట్లాడుతూ ‘‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్)‘ కథలో ఎటువంటి మార్పు చేయలేదు. మొదట ఏ కథ అనుకున్నామో అదే తెరకెక్కుతోంది. మార్పు చేేస ప్రసక్తే లేదు. బ్లాక్బస్టర్ స్ర్కిప్టు అది.
కరోనా కల్లోలం పూర్తిగా ముగిశాక షూటింగ్ తిరిగి ప్రారంభిస్తాం. ఈ సినిమాపై సూపర్ డూపర్ నమ్మకంతో ఉన్నాం. త్వరలో సినిమా టైటిల్ ప్రకటిస్తాం’’అని ఛార్మి చెప్పారు. బాలీవుడ్ నటి అనన్యా పాండే ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వహిస్తున్నారు.
- ఛార్మి