ప్రేమ పేరుతో ఘరానా మోసం
ABN , First Publish Date - 2021-08-20T22:19:31+05:30 IST
ప్రేమ పేరుతో ఓ విద్యార్థిని ఘరానా మోసానికి పాల్పడింది. ప్రేమపేరుతో స్నేహితురాలి సోదరుడికి బీటెక్ స్టూడెంట్ వల వేసింది.
వరంగల్: ప్రేమ పేరుతో ఓ విద్యార్థిని ఘరానా మోసానికి పాల్పడింది. ప్రేమపేరుతో స్నేహితురాలి సోదరుడికి బీటెక్ స్టూడెంట్ వల వేసింది. ముగ్గురు వేర్వేరు యువతుల పేర్లతో యువకుడికి ఫోన్ కాల్స్ చేసింది. ఓ యువతి పురుగుల మందు తాగి చనిపోయిందని బెదిరించి డబ్బులు లాగే యత్నం చేసింది. భయంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కిలాడీ లేడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు సందీప్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల వాసిగా గుర్తించారు. కిలాడి లేడి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మిపురం వాసి.