ఆక్సిజన్‌ సిలిండర్‌ సమకూరుస్తానని మోసం

ABN , First Publish Date - 2021-05-19T09:24:50+05:30 IST

కరోనా రోగికి ఆక్సిజన్‌ సిలిండర్‌ సమకూరుస్తానని రూ.10,500 తీసుకుని మోసగించిన నల్లగొండ జిల్లా చింతలపల్లికి చెందిన రామ్పండి జగనాచారిని కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

ఆక్సిజన్‌ సిలిండర్‌ సమకూరుస్తానని మోసం

నిందితుడిని అరెస్టు చేసిన కరీంనగర్‌ పోలీసులు

కరీంనగర్‌ క్రైం, మే18: కరోనా రోగికి ఆక్సిజన్‌ సిలిండర్‌ సమకూరుస్తానని రూ.10,500 తీసుకుని మోసగించిన నల్లగొండ జిల్లా చింతలపల్లికి చెందిన రామ్పండి జగనాచారిని కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కరీంనగర్‌కు చెందిన రాజేష్‌ తన తల్లికి ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరముందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనిని చూసిన జగనాచారి తన వద్ద ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయంటూ 10,500 ఖాతాలో వేయించుకున్నాడు. ఆ తరువాత ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన రాజేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్టు చేశారు. 

Updated Date - 2021-05-19T09:24:50+05:30 IST