‘కృత్రిమ మేధ’తో బ్యాటరీ సమస్యలకు చెక్
ABN , First Publish Date - 2021-01-05T07:18:47+05:30 IST
ఐఐటీ హైదరాబాద్ స్టార్టప్ సంస్థ ‘ప్యూర్ ఈవీ’.. కృత్రిమ మేధస్సు ఆధారిత హార్డ్వేర్ను అభివృద్ధి చేసింది. ఇది ఎలకా్ట్రనిక్ వాహనాల లిథియం-అయాన్ బ్యాటరీల్లోని లోపాలను గుర్తించి
ఏఐ ఆధారిత హార్డ్వేర్ను అభివృద్ధి చేసిన ఐఐటీహెచ్ స్టార్టప్ ‘ప్యూర్ ఈవీ’
కంది, జనవరి 4: ఐఐటీ హైదరాబాద్ స్టార్టప్ సంస్థ ‘ప్యూర్ ఈవీ’.. కృత్రిమ మేధస్సు ఆధారిత హార్డ్వేర్ను అభివృద్ధి చేసింది. ఇది ఎలకా్ట్రనిక్ వాహనాల లిథియం-అయాన్ బ్యాటరీల్లోని లోపాలను గుర్తించి ఆటోమేటిక్గా మరమ్మతు చేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎలకా్ట్రనిక్ వాహనాల వినియోగదారులు బ్యాటరీ సమస్యలపై సేవా కేంద్రాలను సంప్రదించాల్సిన అవసరం ఉండదని ప్యూర్ ఈవీ ప్రతినిధులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
బ్యాట్రిక్ ఫెరడేగా పిలువబడే ఈ సిస్టమ్ కోసం ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్ వర్క్ (ఏఎన్ఎన్) ఆధారిత అల్గోరిథంను రూపొందించారు. దీని ద్వారా బ్యాటరీలోని వివిధ శ్రేణుల్లోని లోపాలను గుర్తించి, బ్యాటరీ కణాల ఎలకో్ట్ర-కెమిస్ట్రీ సామర్ధ్యానికి తగిన విధంగా మేన్యువల్ అవసరం లేకుండా ఆటోమేటిక్గా మరమ్మతు చేస్తుందని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు నిశాంత్ దొంగరి తెలిపారు.