తనిఖీల్లో మద్యం, గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2020-06-04T08:39:31+05:30 IST

నర్సింహారావుపాలెం శివారు సి.గుడిపాడు డొంకరోడ్డు వద్ద బుధవారం ఎస్సై శివనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ..

తనిఖీల్లో మద్యం, గంజాయి స్వాధీనం

చాట్రాయి, జూన్‌ 3 :  నర్సింహారావుపాలెం శివారు సి.గుడిపాడు డొంకరోడ్డు వద్ద బుధవారం ఎస్సై శివనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ జరిపి 480 మద్యం  సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రీనివా సులు మద్యాన్ని, నిందితులను మీడియాకు చూపించారు. నూజివీడు మండలం రమన్నగూడెంకు చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై తెలంగాణ నుంచి మద్యం తరలిస్తున్నట్టు ఎస్పీకి సమాచారం వచ్చిందన్నారు. తిరువూరు ఇన్‌చార్జ్‌ సీఐ శ్రీను పర్యవేక్షణలో చాట్రాయి ఎస్సై శివనారాయణ తనిఖీలుచేసి మద్యం స్వాధీనం చేసుకున్నార న్నారు.   మద్యం తరలిస్తే రౌడీషీట్‌ కూడా తెరుస్తామని హెచ్చరించారు. 


జగ్గయ్యపేట రూరల్‌ : ఎస్సైలు ధర్మరాజు, తాతాచార్యులు తనిఖీ చేసి 100మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. వీరులపాడు : గూడెంమాధవరం వద్ద ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 130 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిప్రసాద్‌ తెలిపారు. విస్సన్నపేట : మోతేరావుపేటలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని 14మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మణ్‌ తెలిపారు. చండ్రుపట్ల తండాలో ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించి 700  లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ శ్రీనివాస బాలాజీ తెలిపారు. నందిగామ రూరల్‌:   జొన్నలగడ్డ చెక్‌పోస్టు  ఏడుగురిని అదుపులోకి తీసుకుని 48 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కనకారావు తెలిపారు. ఎస్సై ఏసోబు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T08:39:31+05:30 IST