నల్గొండ జిల్లాలో చిరుత దాడి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

ABN , First Publish Date - 2020-05-28T17:19:11+05:30 IST

మర్రిగూడ మండలం రాజపేటతండా దగ్గర చిరుతపులి పంజా విసిరింది. ఇనుప కంచెలో చిక్కుకున్న చిరుతపులి అమాంతంగా బీభత్సం సృష్టించింది. చిరు

నల్గొండ జిల్లాలో చిరుత దాడి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

నల్గొండ: మర్రిగూడ మండలం రాజపేటతండా దగ్గర చిరుతపులి పంజా విసిరింది. ఇనుప కంచెలో చిక్కుకున్న చిరుతపులి అమాంతంగా బీభత్సం సృష్టించింది. చిరుతను బంధించేందుకు అటవీశాఖ, జూపార్క్‌ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. చిరుతను బంధించే ప్రయత్నంలో ఉండగా ఒక్కసారిగా చిరుత సిబ్బందిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అలాగే ఇనుప కంచెలో చిక్కుకోవడంతో చిరుతకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం కదలలేని స్థితిలో అటవీశాఖ సిబ్బంది వాహనాల కింద చిరుత నక్కింది. చిరుతను భద్రంగా పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు కెమెరాలో చిక్కాయి.

Updated Date - 2020-05-28T17:19:11+05:30 IST