రాజుకున్న అగ్గి..

ABN , First Publish Date - 2021-03-05T05:14:08+05:30 IST

శంషాబాద్‌ మండలం సాతంరాయి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు

రాజుకున్న అగ్గి..
సాతంరాయి సమీపంలో రసాయన పదార్థాలు మండటంతో చెలరేగుతున్న మంటలు, పొగ

శంషాబాద్‌ : శంషాబాద్‌ మండలం సాతంరాయి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు డంప్‌ చేసిన రసాయన వ్యర్థాల్లో గురువారం మంటలు చెలరేగి భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో సాతంరాయి, గోకర్‌గూడ, పాషంబండ ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు.  సాతంరాయి-గగన్‌పహాడ్‌ పారిశ్రామిక వాడ నుంచి తెచ్చిన రసాయన వ్యర్థాలను ఖాళీ స్థలాల్లో  డంప్‌ చేస్తున్నారు. ఎండవేడికి ఈ రసాయనాలు అగ్గిరాజుకోవడంతో మంటలు వస్తున్నాయి. నాలుగేళ్లలో ఐదారుసార్లు ఇలాగే జరిగింది. ఈ ప్రాంతాల్లో రసాయన వ్యర్థాలు పారబోయకుండా పీసీబీ చర్యలు తీసుకోవాలని సమీప గ్రామాలవాసులు ఆందోళనలు కూడా చేశారు. మంటలు ఎగిసి పడడం, వాటంతట అవే ఆరిపోవడంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతాల్లో రసాయన వ్యర్థాలు కుప్పలుగా పోస్తున్నవారిపై నిఘాపెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2021-03-05T05:14:08+05:30 IST