గిరిరాజ్లో రసాయణ శాస్త్ర అంతర్జాల సదస్సు
ABN , First Publish Date - 2021-04-21T05:28:51+05:30 IST
జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో రసాయణశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంతర్జాల సదస్సు మంగళవారం నిర్వహించారు.
నిజామాబాద్అర్బన్, ఏప్రిల్ 20: జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో రసాయణశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంతర్జాల సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సును సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాల రసాయన విభాగాల సహకారంతో నిర్వహించారు. ప్రధాన వక్తగా డాక్టర్ షభానషేక్ (యూనివర్సిటీ ఆఫ్ చికాగో) విచ్చేసి బయోమెడికల్ రీసెర్చ్లో రైబోన్యో క్లియిక్ ఆమ్లాల ప్రభావంపై మాట్లాడారు. కార్యక్రమంలో కన్వీనర్ అబ్దుర్ రఫీక్, సుమిత, అభిజిత్, తదితరులు పాల్గొన్నారు.