భార్య పుట్టింటికెళ్లిందని ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-17T17:58:15+05:30 IST

రాణిపేట సమీపం శీకరాజపురంకు చెందిన కార్మికుడు మురుగన్‌ (24) భార్య వైదేహి (21). మురుగన్‌ కూలీ పనులకు వెళ్లి సంపాదించే

భార్య పుట్టింటికెళ్లిందని ఆత్మహత్య

చెన్నై/వేలూరు: రాణిపేట సమీపం శీకరాజపురంకు చెందిన కార్మికుడు మురుగన్‌ (24) భార్య వైదేహి (21). మురుగన్‌ కూలీ పనులకు వెళ్లి సంపాదించే సొమ్ముతో మద్యం తాగుతుండడంతో కొంతకాలంగా దంపతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకొనేవి. ఈ క్రమంలో, శుక్రవారం రాత్రి ఇద్దరి  మధ్య మళ్లీ గొడవలు చెలరేగడంతో వైదేహి చెన్నైలోని పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో, మనస్తాపం చెందిన మురుగన్‌ ఇంటి ప్రాంగణంలోని వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సిప్కాట్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-05-17T17:58:15+05:30 IST