హైదరాబాద్‌పై చెన్నై విజయం

ABN , First Publish Date - 2021-10-01T05:19:51+05:30 IST

ఐపీఎల్ 2021లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై..

హైదరాబాద్‌పై చెన్నై విజయం

ఐపీఎల్ 2021లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(45: 38 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫాఫ్ డూ ప్లెసిస్(41: 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సూపర్ ఓపెనింగ్ ఇచ్చారు. దీంతో చెన్నై జట్టు వేగంగా లక్ష్యం వైపు దూసుకెళ్లింది. ఆ తర్వాత మోయీన్ అలీ(17), సురేశ్ రైనా(2) అంతగా ఆకట్టుకోకపోయినా, చివర్లో అంబటి రాయుడు(17), ఎంఎస్ ధోనీ(14) లాంఛనం పూర్తి చేశారు. ఇక చెన్నై తరపున బౌలింగ్‌లో 3 వికెట్లతో రాణించిన జాష్ హేజల్‌వుడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.



Updated Date - 2021-10-01T05:19:51+05:30 IST