చెన్న కేశవులు మృతి బాధాకరం: నారాయణ
ABN , First Publish Date - 2021-06-24T07:13:33+05:30 IST
ఏఐవైఎఫ్లో చాలా కాలం పనిచేసి పార్టీకి సేవలందించి యువజన సంఘాలు ఏర్పాటు చేసి మన్ననలందుకున్న సీనియర్ నేత మాదాల చెన్న కేశవులు నాయుని మృతి పార్టీకి తీరనిలోటని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు.
తిరుపతి(ఆటోనగర్), జూన్ 23: ఏఐవైఎఫ్లో చాలా కాలం పనిచేసి పార్టీకి సేవలందించి యువజన సంఘాలు ఏర్పాటు చేసి మన్ననలందుకున్న సీనియర్ నేత మాదాల చెన్న కేశవులు నాయుని మృతి పార్టీకి తీరనిలోటని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఆటోనగర్లో మంగళవారం రాత్రి చెన్నకేశవులు నాయుడు మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న నారాయణ తిరుపతికి చేరుకుని ఆయన పార్థీవ దేహంపై పార్టీ పతాకాన్ని కప్పి నివాళులు అర్పించారు. నగరంలో అధిక వడ్డీలు వసూలు చేసే వారిపట్ల చెన్నకేశవులు కఠినంగా వ్యవహరించారని, ఆయన గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో పార్టీ సీనియర్ నాయకులు బి.తులసేంద్ర, ఎ.రామానాయుడు, పి.హరినాధరెడ్డి, పి.మురళి, పెంచులయ్య, మంజులు, నదియా తదితరులు పాల్గొన్నారు.