Tamilnadu: ఆదర్శనీయురాలు చెన్నమ్మ

ABN , First Publish Date - 2021-10-26T16:37:53+05:30 IST

ఇటీవల కన్నుమూసిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ మాతృమూర్తి చెన్నమ్మ సంతాప సభ స్థానిక ఎగ్మూరులోని ఓ హోటల్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ

Tamilnadu: ఆదర్శనీయురాలు చెన్నమ్మ

                  - సంతాప సభలో వక్తల నివాళి


చెన్నై(Chennai): ఇటీవల కన్నుమూసిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ మాతృమూర్తి చెన్నమ్మ సంతాప సభ స్థానిక ఎగ్మూరులోని ఓ హోటల్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన పురప్రముఖులు చెన్నమ్మ చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తంగుటూరి రామకృష్ణతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పొన్నూరు రంగనాయకులు, డాక్టర్‌ సుజాతా రమేష్‌బాబు, స్టెర్లింగ్‌ రామారావు, రాజు, మురళి, జయప్రకాష్‌, బెల్లంకొండ శివప్రసాద్‌, నందకుమార్‌, త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.. చెన్నమ్మ ఆదర్శనీయురాలని, ఎంతోమంది సామాజికసేవ చేపట్టడానికి ఆమే ప్రేరణ అని శ్లాఘించారు. రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాలు, పురాణాలన్నీ ఆమెకు తెలుసని, పురాణాల్లోని నిగూఢ భావాలను సైతం ఆమె ఇట్టే విశదీకరించేవారని వివరించారు.

Updated Date - 2021-10-26T16:37:53+05:30 IST