పక్కీరుపల్లె చెరువు పరిశీలన

ABN , First Publish Date - 2020-12-04T05:07:49+05:30 IST

నగరంలోని పక్కీరు పల్లె చెరువును గురువారం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, కార్పొరేషన్‌, సిటీప్లానింగ్‌ అధికారులు పరిశీలించారు.

పక్కీరుపల్లె చెరువు పరిశీలన
జేసీబీ ద్వారా కాల్వలు తీయిస్తున్న తహసీల్దారు, టీపీఓ

కడప, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పక్కీరు పల్లె చెరువును గురువారం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, కార్పొరేషన్‌, సిటీప్లానింగ్‌ అధికారులు పరిశీలించారు. రెండు జేసీబీలతో రెండు చోట్ల గుంతలు తీసి నీరు సాఫీగా కిందకు వెళ్లేలా కడప తహసీల్దారు శివరామిరెడ్డి, సిటీ ప్లానింగ్‌ ఆఫీసరు క్రిష్ణసింగ్‌ చర్యలు చేపట్టారు. ఈ చెరువు ఏ సమయంలోనైనా తెగుతుందన్న విషయాన్ని కొందరు జిల్లా కలెక్టరు దృష్టికి తేవడంతో దీనిపై అధికారులు స్పందించారు.  

Updated Date - 2020-12-04T05:07:49+05:30 IST