చత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి మృతి

ABN , First Publish Date - 2020-10-01T11:34:25+05:30 IST

వేగంగా వస్తున్న లారీ ఓ వ్యాన్‌ను ఢీకొన్న రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించిన ఘటన...

చత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి మృతి

రాయఘడ్ (చత్తీస్‌ఘడ్‌) : వేగంగా వస్తున్న లారీ ఓ వ్యాన్‌ను ఢీకొన్న రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించిన ఘటన చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని రాయఘడ్ నగరంలో బుధవారం రాత్రి జరిగింది. బుధవారం రాత్రి ఓ లారీ వేగంగా వస్తూ వ్యాన్ ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరు పరారీలో ఉన్నాడని రాయఘడ్ జిల్లా ఎస్సీ సంతోష్ సింగ్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగించారు. పారిపోయిన లారీ డ్రైవరు కోసం గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు.

Updated Date - 2020-10-01T11:34:25+05:30 IST