landless families : ఏడాదికి రూ.6వేల ఆర్థికసాయం
ABN , First Publish Date - 2021-07-29T18:32:04+05:30 IST
భూమిలేని కుటుంబాలకు ఏడాదికి 6వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని...
చత్తీస్ఘడ్ సర్కారు కొత్త పథకానికి శ్రీకారం
రాయపూర్ (చత్తీస్ఘడ్): భూమిలేని కుటుంబాలకు ఏడాదికి 6వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చత్తీస్ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ ప్రకటించారు.2021-22 ఆర్థిక సంవత్సరం సప్లిమెంటరీ బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయిస్తామని సీఎం చెప్పారు. భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు రాజీవ్ గాంధీ గ్రామీణ భూమిహిన్ కృషి మజ్ధూర్ న్యాయ యోజన పథకం కింద ఏడాదికి రూ.6వేలు ఆర్థికసహాయం ఇస్తామని సీఎం వివరించారు. ఈ పథకం కింద క్షురకులు, రజకులు, పూజారులు, కంసలి వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని సీఎం బాగేల్ చెప్పారు.