ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ABN , First Publish Date - 2022-01-25T00:03:28+05:30 IST
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా భరండా పోలీస్స్టేషన్ పరిధి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు దళాల మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా భరండా పోలీస్స్టేషన్ పరిధి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు దళాల మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనలో భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. భరండా అటవీప్రాంతంలో కిస్కోడో ఏరియా కమిటీ మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో డీఆర్జీ బలగాలు ఆదివారం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఇరువర్గాల మధ్య సుదీర్ఘ ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక తుపాకీ, పేలుడు పదార్థాలు, మందులు, ఇతర సామాగ్రి లభించినట్లు డీఎస్పీ అనూజ్కుమార్ ప్రకటించారు.