‘ముక్క’ షాపులు బంద్‌!

ABN , First Publish Date - 2020-04-08T10:05:30+05:30 IST

కరోనా విస్తరిస్తోంది.. సామాజిక దూరం పాటించాలని మొత్తుకుంటున్నా వినకుండా చికెన్‌, మటన్‌ షాపుల ముందు క్యూ కడుతూనే ఉన్నారు.

‘ముక్క’ షాపులు బంద్‌!

అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కరోనా విస్తరిస్తోంది.. సామాజిక దూరం పాటించాలని మొత్తుకుంటున్నా వినకుండా చికెన్‌, మటన్‌ షాపుల ముందు క్యూ కడుతూనే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదివారాలు మాత్రం ఆయా దుకాణాలు మూసివేయాలంటూ కొన్నిచోట్ల స్థానికంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అక్కడి మున్సిపల్‌ కమిషనర్‌ ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారు. చికెన్‌, మటన్‌, రొయ్యలు, చేపల దుకాణాల ముందు విపరీతమైన రద్దీ ఉండడం, సామాజిక దూరం పాటించకపోవడం వల్ల ముందు జాగ్రత్తగా...ఆదివారాలు ఆయా షాపులను తెరవకూడదని ఆదేశించారు.    

Updated Date - 2020-04-08T10:05:30+05:30 IST