వింత వ్యాధితో కోళ్లు మృతి
ABN , First Publish Date - 2021-01-18T05:57:25+05:30 IST
వింత వ్యాధితో కోళ్లు మృతి చెందుతున్నాయని కోళ్ల ఫాం యజమాని సాడిగే రాజేశ్వర్ ఆదివారం బోరుమన్నారు.
ఉట్నూర్ రూరల్, జనవరి 17: వింత వ్యాధితో కోళ్లు మృతి చెందుతున్నాయని కోళ్ల ఫాం యజమాని సాడిగే రాజేశ్వర్ ఆదివారం బోరుమన్నారు. మండలంలోని లక్కారంలోని కోళ్ల ఫాంలో గత రెండు రోజుల నుంచి కోళ్లు వందకుపైగా చనిపోయాయని ఆయన తెలిపారు. కోళ్లు మూర్చబోయి వెంటనే చనిపోతున్నాయని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.