జోగుళాంబ సన్నిధిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ABN , First Publish Date - 2022-06-02T05:35:21+05:30 IST
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్చంద్ర శర్మ దర్శించుకున్నారు.
అలంపూరు, జూన్ 1 : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్చంద్ర శర్మ దర్శించుకున్నారు. అంతకుముందు వారికి అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు వారికి ఆలయాల విశిష్ఠతలను వివరించారు. వారి వెంట ఈవో పురేందర్ కుమార్, సిబ్బంది ఉన్నారు.