కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన కర్ణాటక సీఎం

ABN , First Publish Date - 2020-08-10T23:01:47+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. ఆగస్ట్ 2న కరోనా బారిన పడిన...

కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన కర్ణాటక సీఎం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. ఆగస్ట్ 2న కరోనా బారిన పడిన ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఆయనకు నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆస్పత్రి గది నుంచే ఆయన విధులు నిర్వహించినట్టు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రికి తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-08-10T23:01:47+05:30 IST