బాబుకు నోటీసులిచ్చేందుకు..హైదరాబాద్‌కు కర్నూలు పోలీసులు

ABN , First Publish Date - 2021-05-10T12:53:08+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కర్నూలు జిల్లా పోలీసు బృందం ఆదివారం హైదరాబాద్‌ వెళ్లింది. ఎన్‌440కే స్ర్టెయిన్‌ కొవిడ్‌ వైరస్‌

బాబుకు నోటీసులిచ్చేందుకు..హైదరాబాద్‌కు కర్నూలు పోలీసులు

రాత్రి 10 గంటల వరకు ఇవ్వని వైనం

కర్నూలు, మే 9: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కర్నూలు జిల్లా పోలీసు బృందం ఆదివారం హైదరాబాద్‌ వెళ్లింది. ఎన్‌440కే స్ర్టెయిన్‌ కొవిడ్‌ వైరస్‌ కర్నూలులో ఉందని చెప్పి చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేశారని సుబ్బయ్య అనే న్యాయవాది వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం.. ఈ మేరకు పోలీసులు వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆయనకు సీఆర్‌పీసీ 41 కింద నోటీసులు ఇచ్చేందుకు సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలోని ఓ బృందం హైదరాబాద్‌ చేరింది. ఆదివారం రాత్రి 10 గంటల వరకూ ఆయనకు నోటీసులు ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయమై సీఐని ఫోన్‌లో సంప్రదించగా.. కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నామని బదులిచ్చారు.

Updated Date - 2021-05-10T12:53:08+05:30 IST