22న మంత్రులతో సీఎం సమావేశం

ABN , First Publish Date - 2021-01-20T17:20:02+05:30 IST

ఈనెల 22వ తేదీన రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సచి వాలయంలో సమావేశం కానున్నారు. సీఎం ఢిల్లీ పర్య టన అనంతరం సమావేశం జరుగుతుండడం

22న మంత్రులతో సీఎం సమావేశం

పెరంబూర్: ఈనెల 22వ తేదీన రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి  సచి వాలయంలో  సమావేశం కానున్నారు. సీఎం ఢిల్లీ పర్య టన అనంతరం సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి, సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను, మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకొని రాష్ట్రంలో చేపడుతున్న పథకాలపై వివరించారు. అలాగే, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూడా సీఎం వారితో చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఈ నెల 22న రాష్ట్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. సమావేశంలో సీఎం ఢిల్లీ పర్యటన విశేషాలు, అసెంబ్లీ సమావేశాలు, తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారక మందిరం ప్రారంభోత్సవం తదితరాలపై చర్చించనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

Updated Date - 2021-01-20T17:20:02+05:30 IST