ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సిద్ధం కావాలి
ABN , First Publish Date - 2020-08-05T10:52:05+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే అసెం బ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని ..
గజపతినగరం, ఆగస్టు 4: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే అసెం బ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని మాజీ ఎమ్మెల్యే కె. ఎ. నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రాజధానుల విషయం లో జగన్ నిర్ణయం సరైందేనని భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాకోర్టులో గెలవాలన్న చంద్రబాబు సవాల్ను స్వీకరించాలన్నారు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ మాట మార్చడం దుర్మార్గపు చర్య అన్నారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత ఆరు నెలలుగా దోపిడీలు, కబ్జాలు పెరిగాయని ఆరోపించారు. ఈకార్యక్రమంలో టీఎన్టీఎఫ్ అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు పాల్గొన్నారు.