చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేష్రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
ABN , First Publish Date - 2021-06-19T04:26:53+05:30 IST
సంచలనం సృష్టంచిన ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో
ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్రెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాకేష్రెడ్డి బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టేవేసింది. అభియోగాలు నమోదు చేసి, కేసు విచారణ వేగంగా పూర్తి చేయాలని ట్రయిల్ కోర్టుకు స్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం.ఆర్షాతో కూడిన ధర్మాసనం సూచించింది.