టీవీ పెట్టండి అంకుల్ అన్న 8 ఏళ్ల చిన్నారిని ఘోరంగా..

ABN , First Publish Date - 2020-07-16T17:54:40+05:30 IST

టీవీ చూడటం కోసం పొరిగింటికి వెళ్లిన ఓ 8 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది.

టీవీ పెట్టండి అంకుల్ అన్న 8 ఏళ్ల చిన్నారిని ఘోరంగా..

చెన్నై: టీవీ చూడటం కోసం పొరుగింటికి వెళ్లిన ఓ 8 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తమిళనాడులోని ట్యూటీకోరిన్ జిల్లాలో బుధవారం ఘోరం వెలుగు చూసింది. బాలిక మృత దేహాన్ని నిందితుడు నాలాలో పడేస్తుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మూడో తరగతి చదివే ఆ బాలిక తన తల్లితో కలసి నివసించేది. బాలిక తల్లి రోజుకూలి చేసుకుని పోట్టపోసుకుంటుంది. కాగా.. బుధవారం నాడు ఆ చిన్నారి టీవీ చూడటం కోసం ఎదురింటికి వెళ్లింది. టీవీ ఆన్ చేయండి అంకుల్ అంటూ ఇంటి యజమానికి కోరింది. ఆ సమయంలో నిందితుడు ఫోన్‌లో తన తండ్రితో గొడవపడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు బాలిక గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తరువాత..స్నేహితుడి సాయంతో ఆమె మృత దేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్‌లో పెట్టి స్థానికంగా ఉన్న నాలాలో విసిరేశాడు. చిన్నారి మృత దేహం నాలాలో పడటం గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో  పోలీసులు నిందితుడిని అతడికి సహకరించిన స్నేహితుడిని అరెస్టు చేశారు. అయితే.. బాలికపై లైంగిక దాడి కూడా జరిగిందేమో తెలుసుకునేందుకు పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని వారు తెలిపారు. హత్యా నేరం, పోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.  


Updated Date - 2020-07-16T17:54:40+05:30 IST