బాలింతకు ఐసీడీఎస్ అధికారుల పరామర్శ
ABN , First Publish Date - 2021-05-15T06:47:37+05:30 IST
ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో చికిత్స పొం దుతున్న బాలింతను అధికారులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరో గ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
ఒంగోలు నగరం, మే 14: ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో చికిత్స పొం దుతున్న బాలింతను అధికారులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరో గ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బేస్తవారపేట మండలం కర్లగుంట మండ లానికి చెందిన త్రివేణి అనే గర్భిణి బుధవారం మార్కాపురంలో రోడ్డుపై ప్రసవిం చింది. మెరుగైన చికిత్స కోసం బాలింతను ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలకు త రలించారు. ఈనేపథ్యంలో బాలింతను స్త్రీశిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీదేవి, లీగల్ కౌన్సిలర్ సరళ, ఏఎస్ఐ గౌతమీ త్రివేణిని కలిసి పరామర్శించి మాట్లాడారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అయితే తల్లికి రక్తహీనత ఉందని, త గిన వైద్యం అందిస్తున్నట్లు వారు తెలిపారు.