మిరప పొలాలు పరిశీలిస్తాం
ABN , First Publish Date - 2020-07-08T10:39:33+05:30 IST
రుద్రవరం మండలంలో మిరప పంట తొలగింపు అనే శీర్షిక ఆంధ్రజ్యోతిలో ఈనెల 1న ప్రచురితమైన వార్త నేపథ్యంలో ఉద్యానశాఖ, మహానంది
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు
మహానంది పరిశోధన స్థానం శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం
రుద్రవరం, జూలై 7: రుద్రవరం మండలంలో మిరప పంట తొలగింపు అనే శీర్షిక ఆంధ్రజ్యోతిలో ఈనెల 1న ప్రచురితమైన వార్త నేపథ్యంలో ఉద్యానశాఖ, మహానంది పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం మంగళవారం రుద్రవరం, నాగులవరం గ్రామాల్లో మిరప పొలాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పచ్చి మిర్చి సాగులో ఎదురైన సమస్యలపై అన్ని కోణాల్లో పరిశీలించి వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్కు నివేదిక అందజేస్తామని అన్నారు. లాంఫామ్ నుంచి శాస్త్రవేత్తలను పిలిపించి మరోసారి ఈ పొలాలను పరిశీలిస్తామని అన్నారు.