భారత్, చైనా మధ్య చర్చలు జరగడం సంతోషం : చైనా

ABN , First Publish Date - 2021-03-30T00:33:47+05:30 IST

భారత్, చైనా దేశాల మధ్య జరిగిన సంభాషణలు, చర్చలపై తామెంతో సంతోషంగా ఉన్నామని చైనా పేర్కొంది.

భారత్, చైనా మధ్య చర్చలు జరగడం సంతోషం : చైనా

బీజింగ్ : భారత్, చైనా దేశాల మధ్య జరిగిన సంభాషణలు, చర్చలపై తామెంతో సంతోషంగా ఉన్నామని చైనా పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఇలా చర్చలు జరగడం సానుకూల సంకేతాలనిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణం వల్ల ప్రాంతీయ స్థాయిలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి చోటు చేసుకుంటాయని చైనా పేర్కొంది. ‘‘భారత్, పాక్ మధ్య జరిగిన చర్చలపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రాంతీయ స్థాయిలో స్థిరత్వం, అభివృద్ధి, సానుకూల వాతావరణం కోసం పాక్‌తో కలిసి పనిచేయాలని అనుకున్నాం.’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-30T00:33:47+05:30 IST