పొరుగు దేశాలను చైనా రెచ్చగొడుతోంది.. అమెరికా ఆరోపణ

ABN , First Publish Date - 2020-05-23T03:03:34+05:30 IST

కమ్యూనిస్టు రాజ్యం చైనా.. తన పొరుగు దేశాలను రెచ్చగొట్టేలా మిలటరీ బలాన్ని ప్రదర్శిస్తోందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది.

పొరుగు దేశాలను చైనా రెచ్చగొడుతోంది.. అమెరికా ఆరోపణ

వాషింగ్టన్: కమ్యూనిస్టు రాజ్యం చైనా.. తన పొరుగు దేశాలను రెచ్చగొట్టేలా మిలటరీ బలాన్ని ప్రదర్శిస్తోందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది. చైనా రెచ్చగొడుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నట్లు వైట్‌హౌస్ వర్గాలు చెప్తున్నాయి. ‘ఓ పక్క చైనా నాయకులు ఇతర దేశాలతో వస్తున్న పొరపొచ్ఛాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. మరోపక్క ఆ దేశ మిలటరీ చర్యలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. చైనా మిలటరీ.. పక్క దేశాలను రెచ్చగొట్టేలా, తమ బలాన్ని ప్రదర్శిస్తోంది’ అంటూ శ్వేతసౌధం ఓ నివేదిక విడుదల చేసింది. కాగా, ఇటీవలే చైనా రెచ్చగొట్టే చర్యలను భారత్ తప్పుబట్టింది. దీనికి తమ మద్దతు ఉంటుందని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-05-23T03:03:34+05:30 IST