భారత సరిహద్దులో మానవరహిత హెలికాప్టర్లు!.. చైనా కొత్త వ్యూహం?

ABN , First Publish Date - 2020-05-25T22:19:39+05:30 IST

తొలిసారా పూర్తి దేశీ పరిజ్ఞానంతో చైనా తయారు చేసిన మానవ రహిత హెలికాప్టర్లను భారత సరిహద్దులో గస్తీకి పంపే అవకాశం ఉందని ఆ దేశ మీడియా అంటోంది.

భారత సరిహద్దులో మానవరహిత హెలికాప్టర్లు!.. చైనా కొత్త వ్యూహం?

న్యూఢిల్లీ: తొలిసారా పూర్తి దేశీ పరిజ్ఞానంతో చైనా తయారు చేసిన మానవ రహిత హెలికాప్టర్లను భారత సరిహద్దులో గస్తీకి పంపే అవకాశం ఉందని ఆ దేశ మీడియా అంటోంది. ఏఆర్500సీ అనే ఈ మానవరహిత హెలికాప్టర్లు ఎలక్ట్రానిక్ డిస్రప్షన్, టార్గెట్ ఇండికేషన్, ఫైర్ స్ట్రయిక్, కార్గో డెలివరీ, న్యూక్లియర్ రేడియేషన్ తదితర పనులన్నింటినీ చేయగలవని చైనా ప్రభుత్వానికి చెందిన ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ ఇటీవలే వెల్లడించింది. 5వేల మీటర్ల ఎత్తులో నడవగలిగే ఈ హెలికాప్టర్లను ఇటీవలే తొలిసారి ప్రయోగించారు. ఈ ప్రయోగం ఫలించడంతో ఇప్పుడు వాటిని భారత సరిహద్దులో ఉపయోగించాలని చైనా భావిస్తోందట.

Updated Date - 2020-05-25T22:19:39+05:30 IST