రామతీర్థం ఘటన ఓ దుస్సాహసం: చినజీయర్‌ స్వామి

ABN , First Publish Date - 2021-01-14T23:08:20+05:30 IST

రామతీర్థం ఘటన ఓ దుస్సాహసంగా త్రిదండి చినజీయర్‌ స్వామి అభివర్ణించారు. రామతీర్థంలో చినజీయర్‌ స్వామి పర్యటించారు

రామతీర్థం ఘటన ఓ దుస్సాహసం: చినజీయర్‌ స్వామి

విజయనగరం: రామతీర్థం ఘటన ఓ దుస్సాహసంగా త్రిదండి చినజీయర్‌ స్వామి అభివర్ణించారు. రామతీర్థంలో చినజీయర్‌ స్వామి పర్యటించారు. పర్యటనలో భాగంగా శ్రీకోదండ రామాలయాన్ని చినజీయర్‌స్వామి సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్వామీజీకి అధికారులు తెలిపారు. 


అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఆలయాల భద్రతపై రామతీర్థం ఘటన ఓ హెచ్చరిక. రక్షణ లేని ఆలయాలకు ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఏడాదిలోగా రామతీర్ధం కొండపై పునర్ నిర్మాణ పనులు పూర్తి కావాలి. అంత వరకు కొండ కిందన ఉన్న ఆలయంలో స్వామి వారికి నిత్య సేవలు అందించాలి’ అని కోరారు.

Updated Date - 2021-01-14T23:08:20+05:30 IST