చంద్రబాబు మరోసారి సీఎం కాలేరు: చింతా మోహన్

ABN , First Publish Date - 2021-11-30T20:06:22+05:30 IST

చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాలేరని చింతా మోహన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు మరోసారి సీఎం కాలేరు: చింతా మోహన్

కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాలేరని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బలిజ కులస్థుడు సీఎం కాబోతున్నారని ఆయన జోష్యం చెప్పారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన బలిజ నాయకుడు కోసం వెతుకుతున్నామన్నారు. రాష్ట్రంలో గత 75 ఏళ్లు.. రెడ్డి, కమ్మ కులస్తులే పరిపాలించారన్నారు. సంక్రాంతి లోపు ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-30T20:06:22+05:30 IST