విషాదం..మల్లన్నకొండపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-05-30T21:46:05+05:30 IST
జిల్లాలోని మదనపల్లె మండలం వేంపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది.
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె మండలం వేంపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లన్నకొండపై నుంచి దూకి సుజన అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులతో కలిసి కొండపై ఆలయానికి వెళ్లిన సుజన మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఆలయంలో ఉన్న సమయంలో కొండపై నుంచి దూకింది. నాలుగేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజినీర్ విశ్వనాథ్తో ఆమె వివాహం జరిగింది. కుటుంబ కలహాలే కారణమని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.