చిత్తూరు జిల్లా: గ్రామ సర్పంచ్ వినూత్న నిర్ణయం

ABN , First Publish Date - 2021-08-29T21:08:08+05:30 IST

చిత్తూరు జిల్లా: ఎస్ఆర్ పురం మండలం, పుల్లూరు గ్రామపంచాయతీ సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

చిత్తూరు జిల్లా: గ్రామ సర్పంచ్ వినూత్న నిర్ణయం

చిత్తూరు జిల్లా: ఎస్ఆర్ పురం మండలం, పుల్లూరు గ్రామపంచాయతీ సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా నాటు సారా తయారు చేసినా, అమ్మినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తామని హెచ్చరించారు. ఆధార్, రేషన్ కార్డు, పెన్షన్ వంటివి రద్దు చేస్తామని దండోరా వేయించారు. ఒక వేళ ఎవరైనా తయారు చేస్తున్నట్టుగా సమాచారం ఇచ్చినవారికి రూ. 5 వేల నుంచి రూ. 10వేల వరకు బహుమతులు కూడా ఇస్తామన్నారు. గ్రామాన్ని సారా రహితంగా మార్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్ తెలిపారు.

Updated Date - 2021-08-29T21:08:08+05:30 IST