చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

ABN , First Publish Date - 2021-12-05T21:50:01+05:30 IST

జిల్లాలోని చంద్రగిరి మండలం అగరాల దగ్గర ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో నుంచి మంటలు చెలరేగాయి.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం అగరాల దగ్గర ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఏడాది చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాసులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-12-05T21:50:01+05:30 IST