చిత్రపురికాలనీ అభివృద్ధికి అండగా ఉంటా : చిరంజీవి

ABN , First Publish Date - 2021-01-19T07:19:33+05:30 IST

చిత్రపురికాలనీ అభివృద్ధికి అండగా ఉంటానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు.

చిత్రపురికాలనీ అభివృద్ధికి అండగా ఉంటా : చిరంజీవి
ప్రముఖ నటుడు చిరంజీవిని కలిసిన కొత్తగా ఎన్నికైన చిత్రపురికాలనీ కమిటీ సభ్యులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): చిత్రపురికాలనీ అభివృద్ధికి అండగా ఉంటానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. కొత్తగా ఎన్నికైన చిత్రపురికాలనీ కమిటీ సభ్యులు కాదంబరి కిరణ్‌ ఆధ్వర్యంలో చిరంజీవిని సోమవారం కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఆయన అభినందించి, చిత్రపురికాలనీ అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. చిత్రపరిశ్రమ తరఫున కొత్త కమిటీకి తన మద్దతు ఉంటుందని, కాలనీ సమస్యలు ఏవైనా ఉంటే తాను ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. ఉపాసనతో మాట్లాడి చిత్రపురిలో మంచి ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందిస్తానని, ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తయారు చేసుకొని రావాలని కమిటీ సభ్యులకు సూచించారు. సందర్భం ఉన్నప్పుడు చిత్రపురికాలనీని సందర్శిస్తానని చిరంజీవి చెప్పినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.చిరంజీవిని కలిసిన వారిలో ప్రెసిడెంట్‌ వల్లభనేని అనిల్‌, వినోద్‌బాలా, దీప్తివాజ్‌పేయి, అనిత నిమ్మగడ్డ, లలిత, రామకృష్ణ, ప్రసాద్‌, ఆళ్లహరి ఉన్నారు.  

Updated Date - 2021-01-19T07:19:33+05:30 IST