చిత్తూరులో ఏనుగుల గుంపు బీభత్సం

ABN , First Publish Date - 2021-06-20T14:53:41+05:30 IST

జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం చిక్కనపల్లె, బేలుపల్లె పరిసరాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.

చిత్తూరులో ఏనుగుల గుంపు బీభత్సం

చిత్తూరు: జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం చిక్కనపల్లె, బేలుపల్లె పరిసరాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంట పొలాలుపై ఏనుగులు దాడులు చేశాయి. ఏనుగుల దాడుల్లో పలు పంటలు ధ్వంసమయ్యాయి. ఏనుగుల గుంపు హల్‌చల్‌తో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పంటల ధ్వంసంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల నుంచి తమను రక్షించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-20T14:53:41+05:30 IST