చిత్తూరు కార్పొరేషన్ పై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-03-09T01:40:22+05:30 IST
చిత్తూరు నగర పాలక సంస్థ ఎన్నికలలో జరిగిన ఏకగ్రీవాలను రద్డు చేయాలంటూ
అమరావతి: చిత్తూరు నగర పాలక సంస్థ ఎన్నికలలో జరిగిన ఏకగ్రీవాలను రద్డు చేయాలంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు కార్పొరేషన్లో 37 డివిజన్లు ఏకగ్రీవాలయ్యాయి. వీటిలో దాదాపు 18 డివిజన్లు అక్రమంగా ఏకగ్రీవాలయ్యాయని హైకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు గాను 37 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్ను వైసీపీ కైవసం చేసుకుంది. చిత్తూరులో అధికార పార్టీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. దాదాపు 18 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీతో వైసీపీ నాయకులు విత్ డ్రా చేశారని టీడీపీ ఆరోపించింది ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేదాకా ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలంటూ హైకోర్టును టీడీపీ ఆశ్రయించింది.