చిత్తూరు జిల్లా: వైసీపీలో బయటపడ్డ కుమ్ములాటలు

ABN , First Publish Date - 2021-12-20T17:55:03+05:30 IST

చిత్తూరు జిల్లా: నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కుమ్మలాటలు మరోసారి బయటపడ్డాయి.

చిత్తూరు జిల్లా: వైసీపీలో బయటపడ్డ కుమ్ములాటలు

చిత్తూరు జిల్లా: నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కుమ్మలాటలు మరోసారి బయటపడ్డాయి. మంగళవారం సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా పుత్తూరులో ఆ పార్టీకి చెందిన రెబల్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించివేశారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేయడంతో కలకలంరేగింది. ఫ్లెక్సీలు చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ రెబల్స్ డీఎస్సీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-12-20T17:55:03+05:30 IST