చిత్తూరు జిల్లా: వృద్ధ దంపతుల కీచులాట

ABN , First Publish Date - 2021-08-19T21:29:08+05:30 IST

చిత్తూరు జిల్లా: పలమనేరు పోలీస్ స్టేషన్ ఎదుట వృద్ధ దంపతులు కీచులాడుకున్నారు.

చిత్తూరు జిల్లా: వృద్ధ దంపతుల కీచులాట

చిత్తూరు జిల్లా: పలమనేరు పోలీస్ స్టేషన్ ఎదుట వృద్ధ దంపతులు కీచులాడుకున్నారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. వారు కొట్టుకుంటున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. పక్కనుంచి వెళుతున్న పోలీసులు సయితం వారిని ఆపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 60 ఏళ్ల వయసులో దంపతులు ఇలా కొట్టుకోవడం ఏంటని చూసినవారు అవాక్కయ్యారు. వారిని ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కాసేపటి తర్వాత ఆ వృద్ధ దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2021-08-19T21:29:08+05:30 IST