చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-17T15:57:33+05:30 IST

చిత్తూరు జిల్లా: తిరుపతి-బెంగుళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా: తవణంపల్లి మండలం, తిరుపతి-బెంగుళూరు జాతీయ రహదారి, తెల్లగుండ్ల పల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-10-17T15:57:33+05:30 IST