చిత్తూరు జిల్లా బసినికొండలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-07-22T00:32:44+05:30 IST
చిత్తూరు జిల్లా బసినికొండలో ఉద్రిక్తత
చిత్తూరు: మదనపల్లె బసినికొండలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. స్థల వివాదంలో రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఘటనాస్థలికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇరువర్గాలను చెల్లాచెదురు చేసి అక్కడి నుంచి పంపివేశారు.మంగళవారం రాత్రి గొడవ జరిగింది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. మళ్లీ బుధవారం అదే స్థలం కోసం ఇరువర్గాలు ఘర్షణ దిగాయి.