చిత్తూరులో టీడీపీ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్‌లు

ABN , First Publish Date - 2021-03-01T13:29:45+05:30 IST

జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్నా నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

చిత్తూరులో టీడీపీ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్‌లు

చిత్తూరు: జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్నా నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నానితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. నేడు జిల్లాలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా ఆపే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2021-03-01T13:29:45+05:30 IST