రెండు చోట్ల చోరీలు
ABN , First Publish Date - 2020-12-04T05:12:23+05:30 IST
పట్టణంలో రెండు చోట్ల చోరీలు జరిగాయి.
జమ్మలమడుగు, డిసెంబరు 3: పట్టణంలో రెండు చోట్ల చోరీలు జరిగాయి. ముద్దనూరు రోడ్డులో టీ బంకులో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బంకును పగులకొట్టి అందులో ఉన్న డబ్బులు, సిగరెట్లు, ఇతర వస్తువులు తీసుకుని వెళ్లారు. అలాగే మోరగుడి గ్రామంలో ఓ ఆటో కార్మికుని ఇంటిలో రూ.40 వేలు నగదు చోరీ జరిగిందని అర్బన్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు.